Monday, March 24, 2025
HomeNewsTelanganaTSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం

TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిలిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. గత నెలలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే టీఎస్‌పీఎస్సీ ఛైర్మెన్ జనార్ధన్ రెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు రాజీనామాలు గవర్నర్ కు సమర్పించారు. అయితే, గవర్నర్ వాటిని అప్పటినుండి పెండింగ్ లో ఉంచారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 తో సహా ఇతర పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారంతో ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇంకా వారి రాజీనామాలు పెండింగ్ లో ఉండడం వల్ల కొత్త ఛైర్మెన్, సభ్యుల నియామకాలకు సాధ్యం కాదు. అంతే కాకుండా ఛైర్మెన్ లేకుండా ఉద్యోగాల భర్తీ న్యాయపరంగా సాధ్యం కాదు కాబట్టి.. వారి రాజీనామాలను గవర్నర్ న్యాయ సలహా నిపుణులతో చర్చించి ఆమోదించారు. ఇక కొత్త నియామకాలకు మార్గం సుగమం అయింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments