తెలంగాణ సచివాలయం క్యాంటీన్ లో సుధీర్ఘ కాలంగా పని చేస్తున్న లక్ష్మికి సెక్రటేరియట్ జర్నలిస్టులు ఆర్థిక సాయం అందించారు. ఇటీవల లక్ష్మి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న సచివాలయ పాత్రికేయులు అందరూ కలిసి రూ. 41 వేలు జమచేశారు. బుధవారం రోజు సెక్రటేరియట్ మీడియా సెంటర్ వద్ద లక్ష్మికి ఆర్థిక సాయం అందజేశారు. అయినవాళ్ళు కూడా సాయం చేయని ఈరోజుల్లో.. తనకు జర్నలిస్టులు ఆర్థిక సాయం చేయడం పట్ల లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
సచివాలయ క్యాంటీన్ ఉద్యోగినికి జర్నలిస్టుల ఆర్థిక సాయం
RELATED ARTICLES