Tuesday, April 22, 2025
HomeNewsTelanganavivek venkataswamy: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్

vivek venkataswamy: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా బీజేపీ కార్యక్రమాలకు వివేక్ దూరంగా ఉంటున్నారు. బుధవారం తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తను పార్టీ ప్రాథమికి సభ్యత్వానికి, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో తనకు ఇన్నిరోజులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు తన కుమారుడు వంశీ కూడా పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వివేక్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ పర్యటనలోనే ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్, అతని కుమారుడు వంశీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని వివేక్ అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments