పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదే రోజు జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరోవైపు.. మే మొదటి వారంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రియాంకా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.