కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసింది. అభ్యర్థులుగా విజయశాంతి (BC), అద్దంకి దయాకర్ (SC), శంకర్ నాయక్ (ST) ల పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, గతంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ ఈ ముగ్గురి పేర్లను ప్రకటించింది. అనూహ్యంగా విజయశాంతి పేరును ప్రకటించింది.
Also Read…| సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు
కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సీటు సీపీఐకి కేటాయింపు
ఒక సీటును సీపీఐ పార్టీకి కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు సీపీఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక సీటును ఆపార్టీకి కేటాయించింది.



