రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తెలంగాణ ప్రజలందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.రెండు లక్షల రైతుల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.