ఒవైసీకి భయపడి విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గు చేటు: బండి సంజయ్

మావల్లే తెలంగాణ వచ్చింది. మేం బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరం’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే…ఆ సమయంలో తెలంగాణకు స్వాతంత్ర్యం ఎందుకు రాలేదు? దానికి కారకులెవరు? తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అనే విషయాలను నేటి తరానికి పూర్తిగా తెలియజేయలేకపోవడం విడ్డూరమన్నారు. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు. ‘‘పిడెకెడు మంది ఉన్న దరిద్రపు పార్టీ ఎంఐఎం. ఆ పార్టీకి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఉద్యమ పార్టీ అవుతుందా?’’అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు.

తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో కరీంనగర్ లోని టీఎన్జీవోస్ భవన కళ్యాణ మండపంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ
యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘ఫొటో ఎగ్జిబిషన్’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే ఈ ఫొటో ఎగ్జిబిషన్ లక్ష్యం. కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితరుల పోరాటాల చరిత్రను స్మరించుకునే అవకాశం ఈ ఎగ్జిబిషన్ ద్వారా కలుగుతోంది.’’అని చెప్పారు.

అట్లాగే బైరాన్ పల్లి సంఘటన, రజాకార్ల ఆక్రుత్యాలతోపాటు సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో నిర్వహించి హైదరాబాద్ సంస్థానికి విముక్తి కలిగించిన ప్రధాన సంఘటనలతో ఈ ఎగ్జిబిషన్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూసే అవకాశం లభించిందన్నారు. గతం ఎట్లుందో తెలుసుకోవడమంటే భవిష్యత్తుకు దారిని నిర్మించుకోవడమేనని, గతాన్ని మర్చిపోయిన జాతి ఎన్నడూ సవ్యంగా ముందుకు పోదన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ సర్దార్‌ వల్లభాయి పటేల్‌ చేసిన సాహసాన్ని, పోరాటా యోధులను స్మరించుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విధానాలను దేశంలో ఇంకా అవలంబించి ఉంటే భారత దేశం 10 ముక్కలయ్యేదన్నారు. సర్దార్ పటేల్ దేశంలోని 562 సంస్థానాలను విలీనం చేసిన దేశభక్తుడని కొనియాడారు. పటేల్ ముమ్మాటికీ తమకు అరాధ్యుడేనని, బీజేపీ అధికారలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఏటా ‘తెలంగాణ విమోచన దినోత్సవాల’ పేరుతోనే అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అట్లాగే హైదరాబాద్ లో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ విమోచన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అరుదైన చిత్రాలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటున్నందున నగర ప్రజలు వీక్షించాలనీ కోరారు

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img