Friday, May 16, 2025
HomeNewsTelanganaతెలంగాణ‌లో రాబోయేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేః ఎంపీ ఆర్. కృష్ణయ్య

తెలంగాణ‌లో రాబోయేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేః ఎంపీ ఆర్. కృష్ణయ్య

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలందరు బీజేపీ వెంటే ఉన్నారని… అందుకు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన గురువారం 40 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భారత్ కుమార్ ను ఆర్. కృష్ణయ్య నియమించారు. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని , పోరాటాల ద్వారానే అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదం చేస్తున్నాయని ఆర్. కృష్ణయ్య అన్నారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ బీసీ సంఘాన్ని బలోపేతం చేయడానికి భారత్ కుమార్ కు ఈ పదవీ అప్పగించినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిపథంలో సాగుతుందని… రాష్ట్రంలో కూడా అదే అభివృద్ధి బిజెపితోనే సాధ్యం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే , బీసీనే ముఖ్యమంత్రి అవుతారని కృష్ణయ్య స్పష్టం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments