NewsTelanganaతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని బలోపేతం చేయాలి : ఏపీ...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని బలోపేతం చేయాలి : ఏపీ మంత్రి సత్యకుమార్

-

- Advertisment -spot_img

తెలంగాణలో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం, రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని సొంతంగా అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.

ఆదివారం హైదరాబాద్‍లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సోలంకీ శ్రీనివాస్ స్వగృహంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో బీజేపీని పటిష్టం చేయడం కోసం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలన్నారు. ప్రధాని మోదీ నేతృతంలో దేశం వేగంగా పురోగమిస్తోందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే మారనుందన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కలలను సాకారం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

ఈనాటి మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలుగు భాషా ప్రాశస్త్యం, ప్రాముఖ్యతను పొగడటం, తెలుగులో తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం అభినందనీయమన్నారు.

దేశ ప్రగతి పథంలో సాధించిన విజయాల్లో కొన్నింటి గురించి ప్రధాని ప్రస్తావించారని, అంతరిక్ష రంగంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, వాటిని వినియోగించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రధాని చెప్పిన విషయాలను, సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను సత్యకుమార్​ యాదవ్​ కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you