గత కొంత కాలంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి వైఖరిపై కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ప్రకటన విషయంలో రాజాసిగ్ సూచించిన వ్యక్తికి కాకుండా.. పార్టీకోసం పనిచేయని వారికి ఆపదవి ఇవ్వడంపై, పార్టీ రాష్ట్ర నేతలపై సంచల వ్యాఖ్యలు మరువకముందే.. తాజా వ్యాఖ్యలు బీజేపీలో వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు..
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవుతున్నారు. కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీలు అవుతున్నారని ఆరోపణలు చేశారు. సీనియర్ నేతలే ఇలా చేస్తే బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందని రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, ఒక అడుగు ముందుకు వేసి.. పార్టీలోని పాతసామాను బయటికి వెళ్తేనే.. పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై ఆలోచించాలని కోరారు. పార్టీలో కొంత మంది ఇది ‘నా పార్టీ’.. ‘నా అయ్య పార్టీ’ అని కొంతమంది పార్టీలో ఉన్నారని అన్నారు. అలాంటి వారిని పార్టీ నుండి రిటైర్ చేస్తేనే పార్టీకి మంచిరోజులు వస్తాయని అన్నారు.
2018 ఎన్నికల ముందు కూడా ఇలాగే..
2018 ఎన్నికల ముందు కూడా కొంతమంది రాష్ట్రపార్టీ నేతలు అప్పటి సీఎం కేసీఆర్ ను కలిశారని అన్నారు. ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ వల్లడం వల్లే అప్పుడు కేవలం బీజేపీ కేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకుందని.. అదికూడా తాను ఒక్కడినే విజయం సాధించానని గుర్తుచేశారు. అధికారంలో ఎవరు ఉన్నా వారిని చాటుమాటుగా కలవడం పార్టీ సీనియర్లకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. వారివిషయంలో అధిష్టానం ఆలోచన చేయాలని రాజాసింగ్ అంటున్నారు. ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని, పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేనని అంటున్నారు.
Also Read… | TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. 2.5% డిఏ ప్రకటన
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే ఇక్కడి హిందువులకు రక్షణ ఉంటుందని అన్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉందని బాహాటంగా అన్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తేనే కాంగ్రెస్, బీఆర్ఎ్సకు ధీటుగా బీజేపీ ఎదుగుతుందని నెల రోజుల క్రితం మరో లేఖ విడుదల చేశారు. అలాగే, గోల్కొండ గోషామహల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకంపైనా రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.