Friday, June 13, 2025
HomeNewsAPతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనగిరి ఎంపీ చామల

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనగిరి ఎంపీ చామల

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం దేవాలయం వెలుపల ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం బాగా జరిగిందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆలయ పండితులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు, దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments