తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బీదర్లో కేసీఆర్కు దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ నకిలీ నోట్లను కేసీఆర్ ఉపయోగించారని సంజయ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా దివాళా తీసిందని, రాష్ట్రం రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని సంజయ్ విమర్శించారు. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రం ఈ దుస్థితికి చేరుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. .