NewsTelanganaమార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం నియామకం

మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం నియామకం

-

- Advertisment -spot_img

చేర్యాల, వనపర్తి రోడ్డు, దేవరకద్ర మరియు చొప్పదండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గ సభ్యులను మరియు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

చేర్యాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నల్లనాగుల శ్వేత, వైస్ చైర్ పర్సన్ గా కమిడి జీవన్ రెడ్డిని , వనపర్తి రోడ్డు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్ పర్సన్ గా తిరుపతి రెడ్డిని , దేవరకద్ర అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎం. కటలప్ప, వైస్ చైర్ పర్సన్ గా హన్మంత్ రెడ్డిని, మరియు చొప్పదండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కొత్తూరి మహేష్, వైస్ చైర్ పర్సన్ గా మునిగాల రాజేందర్ లను మరియు నూతన పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా మంత్రి తమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 19 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించాం. మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా కొత్త మార్కెట్ కమిటీలను నియమిస్తాం’’ అని అన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనా పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియచేస్తూ, మార్కెట్ యార్డులలో రైతులు తమ పంటను అమ్ముకోవడానికి అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలని, మార్కెటింగ్ పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం వారి బాధ్యత అని గుర్తుచేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you