700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్.. 500 మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్ బాబు


బీర్లు, శీతల పానీయాలు, పర్ ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఉత్పాదన యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ‘బాల్’ ఇండియా కార్పోరేట్ వ్యవహారాల అధిపతి గణేశన్ ఆదివారం మంత్రితో సచివాలయంలో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తమ సంస్థ విస్తరణ ప్రణాళికను శ్రీధర్ బాబుకు వివరించారు. ‘బాల్’ సంస్థకు రాష్ట్రంలో అవరసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు ఆయనకు హామీ ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయని మంత్రి తెలిపారు. ఇది 2 శాతం లోపలే ఉందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్ లో టిన్నుల వాడకం 25 శాతం వరకుందని వెల్లడించారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని అన్నారు. 500 మి.లీ పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబుకు తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరిస్తున్న బాల్ బెవరేజెస్ ప్యాకేజింగ్ సంస్థ ఇండియా హెడ్ గణేశన్

కిందటి సారి తన అమెరికా పర్యటన సందర్భంగా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉన్న కోకా కోలా కేంద్ర కార్యాలయానికి వెళ్లినప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. రూ.1000 కోట్లతో ఏర్పాటయ్యే కోక్ బాట్లింగ్ యూనిట్ కు ‘బాల్’ సంస్థ అల్యూమినియం టిన్నులను చేస్తుందని వివరించారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తి ప్రణాళికను సమర్పించాలని గణేశన్ కు శ్రీధర్ బాబు సూచించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img