Menu

  • Home
  • అంతర్జాతీయం
  • కోల్‌కతా టెస్ట్‌లో టీమిండియా ఓటమి.. 30 పరుగుల తేడాతో సఫారీల విజయం
Team India loses in Kolkata Test against South Africa

కోల్‌కతా టెస్ట్‌లో టీమిండియా ఓటమి.. 30 పరుగుల తేడాతో సఫారీల విజయం

కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో (IND Vs SA ) దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి చెందింది. కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమిండియా, నాలుగో ఇన్నింగ్స్‌లో కేవలం 35 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. నాలుగో రోజు లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభం నుంచి షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4 బంతుల్లో) డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ కేవలం ఒకే పరుగు (6 బంతులు) చేసి వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ వరుస ఓవర్లలో ఈ రెండు కీలక వికెట్లు తీయడంతో, భారత జట్టు కేవలం 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో వాషింగ్టన్ సుందర్ మరియు ధ్రువ్ జురెల్ (13 పరుగులు) కలిసి మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించి కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. కానీ, జురెల్‌ను హర్మర్ అవుట్ చేయడంతో పతనం మళ్లీ మొదలైంది. రిషబ్ పంత్ (2 పరుగులు) పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (18 పరుగులు), వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 26 పరుగులు జోడించినా, హర్మర్ మళ్లీ బ్రేక్ ఇచ్చాడు. చివర్లో అక్షర్ పటేల్ (26 పరుగులు) దూకుడుగా ఆడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఓపెనర్ వాషింగ్టన్ సుందర్ 31 పరుగులతో ఒంటరి పోరాటం చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగకపోవడంతో భారత ఇన్నింగ్స్ 93 పరుగులకే ముగిసింది.


Team India loses in Kolkata Test against South Africa

అంతకుముందు, 93/7 స్కోరు వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా, అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ పరుగులే చేసి భారత్‌కు సవాలు విసిరింది. రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌట్ కావడంతో, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు దక్కిన 30 పరుగుల ఆధిక్యం పోగా, టీమిండియా ముందు 124 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బావుమా అసలు సిసలు పోరాటం చేశాడు. 136 బంతులు ఎదుర్కొని, 4 ఫోర్లతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్బిన్ బాచ్‌తో కలిసి 8వ వికెట్‌కు 44 పరుగులు, హర్మర్‌తో కలిసి 18 పరుగులు జోడించి జట్టును పటిష్టమైన స్థితికి చేర్చాడు.

Also Read..| మరోసారి బిహార్‌ సీఎంగా నితీశ్ కుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

Share the post

Also Read..