ప్రపంచ శాంతి కోసం పోప్ ఫ్రాన్సిస్ చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాన్ని మానవసేవకు, క్రైస్తవ మత ప్రచారానికి అంకితం చేశారని, శరణార్థులకు అండగా నిలిచారని కొనియాడారు. సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని సీఎం అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం మానవాళికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Chief Minister Shri @revanth_anumula expressed profound shock and sorrow over the passing of His Holiness Pope Francis, the esteemed head of the Roman Catholic Church and sovereign of Vatican City. He paid rich tributes to the Pope, lauding his tireless efforts in championing the… pic.twitter.com/zj6JjDKF07
— Telangana CMO (@TelanganaCMO) April 21, 2025