SportsIndia vs England: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్

India vs England: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్

-

- Advertisment -spot_img

ఇంగ్లండ్‌లోని లీడ్స్ మైదానంలో జరుగుతున్న India vs England మద్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 152 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కలిపి వంద పరుగుల మార్కును అందుకున్నాడు. జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం 74 బంతుల్లో 58 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 78 బంతుల్లో 42 పరుగులు చేసి గౌరవప్రదమైన ఇన్నింగ్స్‌ను అందించాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, 51 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగితే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read..| Sai Pallavi: ‘కుబేర’ పై సాయి పల్లవి ప్రశంసల జల్లు

ఈ అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. గత పదేళ్లుగా భారత టెస్టు జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా యువ జట్టు బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. యువ ఆటగాళ్లు ఈ అవకాశం ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you