SportsWorldCup 2023 IND vs SL: ఇండియా ఆల్ రౌండ్ షో.....

WorldCup 2023 IND vs SL: ఇండియా ఆల్ రౌండ్ షో.. శ్రీలంకపై భారీ విజయం.. నేరుగా సెమీస్ కే

-

- Advertisment -spot_img

శ్రీలంకపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 302 పరుగుల భారీ తేడాతో విజయా ఢంకా మోగించింది. నేరుగా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. వరల్డ్ కప్ లో ఇండియా ప్లేయర్ల ఆట దెబ్బకు ప్రత్యర్థులు ఖంగుతిన్నారు. 2023 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఇండియా ఓడిపోలేదు. ఆడిన 7 మ్యాచ్ లలో ఏడింటిలో గెలిచింది. తాజాగా గురువారం శ్రీలంకతో జరిగిన ఆటలో గెలిచి పాయింట్ల టేబుల్ లో మొదటిస్థానంలో ఉంది. ముందుగా టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 357 పరుగులు చేసింది. విరాట్ కొహ్లి, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు. వారు సెంచరీకి దగ్గరగా వచ్చి అవుటయ్యారు. చివరలో జడేజా విజృంభించి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లను బుమ్రా, సిరాజ్, షమి చావు దెబ్బ తీశారు. పరుగులు తీయడం శ్రీలంక బ్యాటర్ కు కష్టంగా మారిందంటే ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్లు డకౌట్ గా వెనుదిరిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక ఆటగాళ్లు ఒక్కరు కూడా క్రీజులో నిలువలేక పోయారు. ఇండియా 302 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయా ఢంకా మోగించింది. దీంతో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లు అయింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you