బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు షర్మిల ఫోన్! ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడుదామని పిలుపు

తెలంగాణ పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లకు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. టిఎస్పిఎస్సి పేపర్ లీక్ అంశంపై అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుదామని ఆమె ప్రతిపాదించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్ష పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బ్రతకనివ్వరని షర్మిల అన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరం ఉందని ఆమె వివరించారు. షర్మిల ప్రతిపాదనలకు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. దీనిపై త్వరలోనే సమావేశం అవుదామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చిన తరువాత ఉమ్మడిగా కార్యాచరణ దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

sharmila 1

ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ విధంగానే షర్మిల రెండు పార్టీలకు లేఖలు రాశారు. ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కానీ అప్పుడు స్పందించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం విషయంలో సానుకూలంగా స్పందించారని సమాచారం. ఇటీవల తెలంగాణ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. గతంలో నిరుద్యోగుల పక్షాన ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల దీక్షలు కూడా చేశారు. ఇప్పుడు షర్మిల ప్రతిపాదించిన విధంగా బిజెపి కాంగ్రెస్ పార్టీలు కలిసి వస్తాయా.. ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేస్తారా.. అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img