బొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికే లాభం.. సింగరేణి విషయంలో రాజకీయాలొద్దు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రానున్న రోజుల్లో దేశ అవసరాలకు తగ్గట్లుగా బొగ్గు ఉత్పత్తిని పెంచుతూ.. ఈ రంగంలో ఆత్మనిర్భరతకోసం కృషిచేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బొగ్గుపై ఆధారపడిన విద్యుదుత్పత్తి, సిమెంట్ తయారీతోపాటుగా ఇతర పరిశ్రమలకు బొగ్గు కొరత రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన 10వ విడత కమర్షియల్ మైనింగ్ వేలం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. బొగ్గు రంగంలో అత్యాధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను అవలంబించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

కోల్ గ్యాసిఫికేషన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బొగ్గుద్వారా జరుగుతున్న విద్యుదుత్పత్తిని మరింత పెంచే దిశగా కోల్ గ్యాసిఫికేషన్ ఓ విప్లవాత్మకమైన సంస్కరణ కానుందన్నారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ టార్గెట్ గా పనిచేస్తామన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనలకు అనుగుణంగా.. చక్కటి ఫలితాలను సాధించేందుకు 100 రోజుల ప్రణాళిక, వచ్చే ఐదేళ్ల కోసం ప్రణాళిక రూపొందించుకుని పని ప్రారంభించామని అన్నారు.

తెలంగాణలోని సింగరేణి విషయంలో రాజకీయాలకు చోటు లేదని.. ఈ విషయంలో అనవసరంగా రాజకీయాలు చేయొద్దని విపక్ష పార్టీలకు సూచించారు. కోల్ ఇండియాకు ఇచ్చిన ప్రాధాన్యతనే.. సింగరేణికి కూడా కేంద్రం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సింగరేణిని కేంద్రం ఆదుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు.

రెండు గనుల విషయంపై కేంద్రం దృష్టి సారించిందని.. ఒడిశాలోని నైని ప్రాజెక్టుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. బొగ్గు గనుల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే పాలసీని కేంద్రం అమలుచేస్తోందన్నారు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేస్తామన్నారు. సింగరేణిలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని అధిగమించి.. సింగరేణి అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. గనుల వేలం అనేది.. ఓ బహిరంగ ప్రక్రియ అని ఇందులో ఎవరైనా పాల్గొన వచ్చన్నారు.

సింగరేణి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో బొగ్గురంగంలో సాధించిన ప్రగతిని, భవిష్యత్తుకోసం పెట్టుకున్న లక్ష్యాలను ఆయన వివరించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img