NewsTelanganaవరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటన.. సీఎం కేసీఆర్ పై...

వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటన.. సీఎం కేసీఆర్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

-

- Advertisment -spot_img

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందస్తుగా వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షలు చేయకుండా ప్రగతి భవన్ ను చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్రంలో భారీ వ‌ర్షాల‌తో జ‌నం అత‌లాకుత‌లం అవుతుంటే ఒక‌రు ఫామ్ హౌస్ లో, మ‌రొక‌రు విందుల‌లో మునిగి తేలుతున్నారని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది… సీఎం, మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం అన్న‌ది ఉందా ? సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ భూమి మీద ఉన్నా లేన‌ట్టేనా? అందుకే వారు లేర‌ని ఇప్ప‌టికే ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యార‌ని సోమవారం ఆ ఇద్ద‌రు తండ్రీ కొడుకుల‌కు త‌ద్దినం పెట్టాల‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌కు పిలుపునిస్తున్నా” అని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


తొమ్మిదేళ్లుగా ప్రతీ సంవత్సరం వరదలు రావడం, ప్రభుత్వం మరిచిపోవటం అనేది పరిపాటిగా మారిందని ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈరోజు వరకు 3 వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిన అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూముల రైతులకు రూ.20 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సాహాయం అందించాలని అన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి నష్ట పరిహారంగా 15 వేల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.


శనివారం తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. వరదలపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్ రాజకీయాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలమైతే పట్టించుకోకుండా తండ్రీ కొడుకులు ప్రజల ప్రాణాలు పూచీక పుల్లతో సమానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించటం లేదా అని ప్రశ్నించారు.
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేటీఆర్ కు బాత్రూంలు కడగడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారు మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదు అని విమర్శించారు. హైదరాబాద్ నగరంపై కేటీఆర్ వి ఆర్భాటపు ప్రకటనలే తప్ప మరొకటి కాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరం పరిస్థితి మేడిపండు చందంగా మారిందన్నారు. పాలకుల కక్కుర్తి వల్లే కాలనీలు వరదల్లో మునిగిపోయాయని ఆరోపించారు. నిజాం కాలం నాటి చెరువులను 90 శాతం మంది బీఆరెస్ నేతలే ఆక్రమించుకున్నారని.. చెరువుల ఆక్రమనలతో కాలనీలు వరదల్లో మునిగిపోయాయి అని ఆరోపించారు. కేటీఆర్ కు విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

రియల్ ఎస్టేట్ కోసమే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆరెస్ లో చేరారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సుధీర్ రెడ్డి మూసి రివర్ ఫ్రంట్ ఆథారిటికి చైర్మన్ అయ్యి.. నియోజకవర్గ ప్రజలను మూసీలో ముంచారు అని ఆయన ఎద్దేవా చేశారు. వరదలు, వర్షాలతో 30 మంది చనిపోయినా ఎందుకు పరామర్శించేందుకు లేదని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో కుక్కలకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది.. అందుకే ఈ ప్రభుత్వానికి వరద నీటిలో తద్దినం పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నా అన్నారు.

హైకోర్టు అక్షింతలు వేసినా కేసీఆర్ కు బుద్ది రాలేదు అని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తాత్కాలిక వరద సాయం కింద రాష్ట్రానికి వెయ్యి కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం మంత్రి కిషన్ రెడ్డిపై ఉందన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రి కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడి పరిస్థితిని కిషన్ రెడ్డి ప్రధానికి వివరించి వెంటనే నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్రంలోని వరద నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి

ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా రేవంత్ రెడ్డి పరిశీలించారు. సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి లేకుంటే సోమవారం పార్లమెంటులో నితిన్ గడ్కరీకి నివేదిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యంపై అధికారులతో మాట్లాడారు. కారిడార్ పనులు వేగవంతం చేసి సమస్యను పరిష్కరించాలని ఈఈ, ఈఎన్సీ అధికారులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాఖల మధ్య సమన్వయలోపం కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎలివేటెడ్ పనుల సాగదీతతో స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.

మమతా నగర్ నాలా పనుల పరిశీలన

నాగోల్ మమతా నగర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఆ కాలనీలో అసంపూర్తిగా ఉన్న నాలా పనులను పరిశీలించారు. నాలా పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తవ్వి వదిలేసిన నాలా ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ వాసులు ప్రమాదం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా నాలా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో ఇబ్బందులు పడుతున్నామని ఎల్బీ నగర్ సాగర్ రోడ్డులోని ఓంకార్ నగర్ కాలనీవాసులు రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు.

కొల్లాపూర్ నాయకుల చేరికలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోడేర్ మండలం బావాయిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు తదితరులు పార్టీలో చేరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you