తిరుపతి రైల్వేస్టేషన్ అత్యాధునిక హంగులతో ముస్తాబు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి స్టేషన్ ను తీర్చిదిద్దుతోంది. రెండు సంవత్సరాలక్రితం రూ.300 కోట్లతో అభివృద్ధి, ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం దక్షిణం వైపు నూతన భవన నిర్మాణ పనులు 70% వరకు పూర్తయ్యాయి. దీనిని మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటు లోకి తెస్తామని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు.