Thursday, May 15, 2025
HomeNewsTelanganaతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్ బండ్

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్ బండ్

తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

జూన్ 2 వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్ పై పండుగ వాతవరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం ఎల్ సి లు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అవతరణ వేడుకలలో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు జరిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక పై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణాన్ని అణుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి.

ఏర్పాట్లు సమీక్షించిన ఉన్నతాధికారులు

ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పలు విభాగాల ఉన్నతాధికారులు ట్యాంక్ బండ్ వేదిక వద్ద పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిధిలకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్ , బ్యారికేడింగ్, పార్కింగ్ , త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తూ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మోబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఈ.డీ స్క్రీన్ ల తో, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ , హైదరాబాద్ వాటర్ వర్క్స్ యం.డి. సుదర్శన్ రెడ్డి, జి.హెచ్.యం.సి కమీషనర్ రోనాల్డ్ రాస్, పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్.యం.డి.ఎ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డి.జి. శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను సమీక్షించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments