Wednesday, March 26, 2025
HomeNewsTelanganaఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సి.శైలజ (16) తుదిశ్వాస విడిచింది. అక్టోబర్ 30న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ వల్ల 64 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు విద్యార్థినులు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అందులో తోమ్మిదో తరగతి చదువుతున్న శైలజ పరిస్థితి బాగా సీరియస్ గా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె శరీరం చికిత్సకు సహకరించక పోవడంతో సోమవారం రోజున ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో శైలజ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments