విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పాస్పోర్ట్ సేవల కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా, విజయవాడ సేవా కేంద్రంలో 800, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లను శనివారం విడుదల చేశారు.
ఇప్పటికే అపాయింట్మెంట్లు ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్లను ఈ ప్రత్యేక డ్రైవ్ కోసం రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు, ఏప్రిల్లో ప్రతి బుధవారం విజయవాడ సేవా కేంద్రంలో 750 అదనపు అపాయింట్మెంట్లతో సాధారణ డ్రైవ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read…| ఏంటి బ్రో ఇంతందంగా ఉన్నారు !
ఈ ప్రత్యేక డ్రైవ్, సాధారణ డ్రైవ్ పాస్పోర్ట్ సేవలను వేగవంతం చేయడానికి, దరఖాస్తుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయన్నారు. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.