Friday, April 18, 2025
HomeNewsTelanganaసిద్దిపేట జిల్లా వేచరేణిలో దారుణం.. అంత్యక్రియల కోసం వాగు దాటేందుకు ప్రజల అవస్థలు

సిద్దిపేట జిల్లా వేచరేణిలో దారుణం.. అంత్యక్రియల కోసం వాగు దాటేందుకు ప్రజల అవస్థలు

సిద్దిపేట జిల్లా చేర్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు వాగు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన బాలయ్య అనే వృద్ధుడు మరణించడంతో దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు బంధులవులు నిర్ణయించారు. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామం పక్కనే వాగులోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. అంత్యక్రియలకు శవంతో పాటుగా నడుము లోతు నీటిలో నుండే వాగు దాటి అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో శవంతో పాటు వాగు దాటుతున్నవీడియో వైరల్ అయింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్ధితి ఇలా ఉంటే మిగతా జిల్లాలలో ఏవిధంగా ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రామాలలో ఒక ఫ్లై ఓవర్ కూడా కట్టలేని ప్రభుత్వం అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు గతంలో ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. కానీ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments