NewsTelanganaకేసీఆర్ తోనే గిరిజనులకు సాధికారత: ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ తోనే గిరిజనులకు సాధికారత: ఎమ్మెల్సీ కవిత

-

- Advertisment -spot_img

సీఎం కేసీఆర్ తోనే గిరిజనులకు సాధికారత కలిగిందని, రిజర్వేషన్ల పెంపుతో విద్య సంస్థల్లో గిరిజన బిడ్డలకు అడ్మిషన్లు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సబ్ ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 3300 తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దని స్పష్టం చేశారు. జూమ్ యాప్ ద్వారా అంతర్జాతీయ బంజారా విద్యార్థుల సమావేశంలో కవిత మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి నిధులను వినియోగించలేదని, కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వినియోగిస్తోందని స్పష్టం చేశారు. ఒకవేళ ఒక ఏడాది నిధులు పూర్తిగా వినియోగంకాకపోతే ఆ నిధులు వచ్చే ఏడాదికి కూడా బదిలీ అయ్యేలా సీఎం కేసీఆర్ సబ్ ప్లాన్ కు రక్షణ కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్ని సామాజిక వర్గాల సాధికారతకు పాటుపడుతున్నామని చెప్పారు. గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రేన్యూవర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, రూ. 2 కోట్ల రుణం కూడా ప్రభుత్వం అందజేస్తున్నదని పేర్కొన్నారు.

తెలంగాణలో గిరిజన జనాభా పెరిగినందున ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము విజ్ఞప్తి చేశామని, కానీ కేంద్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను పెంచిందని స్పష్టం చేశారు. దాంతో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీ విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలను చేయడం విప్లవాత్మక చర్య అని అన్నారు. 3300 తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, మెడికల్ షాపుల స్థాపనలో రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. స్కాలర్ షిప్ లను అందిస్తునే ఉన్నామని, ఈ విషయంలో కేంద్రం మాత్రం అనేక ఆంక్షలు విధిస్తున్నదని, అయినా స్కాలర్ షిప్ లను కొనసాగిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య, విద్య సౌకర్యాలను మెరుగుపర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి అనేక మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటుండడం సంతోషకరమన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా ఎదిగిందని తెలిపారు. హైదరాబాద్ కు అనేక పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, జిల్లాల్లో కూడా ఐటీ పరిశ్రమలు వస్తుండడం సంతోషకరమన్నారు. మౌలిక సదుపాయాలను వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు. వివక్ష లేకుండా పరిపాలన చేస్తున్నామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇస్తోందని, ఇలా బీఆర్ఎస్ పార్టీ సానుకూల రాజకీయాలు చేస్తున్నదని స్పష్టం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you