Thursday, May 15, 2025
HomeNewsTelanganaజీవో నంబర్ 46 అభ్యర్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: కేటీఆర్

జీవో నంబర్ 46 అభ్యర్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: కేటీఆర్

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా జీవో నంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని కోరుతూ జీవో నంబర్ 46 అభ్యర్థులు కేటీఆర్ ను నందినగర్ లోని నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాకేష్ రెడ్డి తో కలిసి అభ్యర్థులు కేటీఆర్ ను కలిసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఎన్నికలకు ముందు జీవో నంబర్ 46 ను రద్దు చేస్తామని నమ్మబలికితే కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు సహకరించామని కానీ గెలిచిన తర్వాత పట్టించుకోవటం లేదని అభ్యర్థులు కేటీఆర్ ముందు వాపోయారు. ఐతే ఈ సమస్యకు సంబంధించి గతంలో సీఎస్ తో మాట్లాడిన అంశాన్ని కేటీఆర్ వారికి గుర్తు చేశారు.

అదే విధంగా ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. అందుకు బీఆర్ఎస్ నుంచి కాావాల్సిన సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. కోర్టు కేసులను తప్పించుకుంటూ అభ్యర్థులకు అన్యాయం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. ఈ విషయంలో తమ పార్టీ నాయకులు గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తున్న విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. జీవో నంబర్ 46 విషయంలో పోరాటం చేస్తున్న అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తమ సమస్య తీరే వరకు అండగా ఉంటామని ధైర్యమిచ్చిన కేటీఆర్ కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments