NewsInternationalప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

-

- Advertisment -spot_img

భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హానర్ అవార్డు అందుకున్నారు. ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ చేతుల మీదుగా అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రోజు పారిస్ కు చేరుకున్న ప్రధాన మంత్రి మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఈ రోజు జరగనున్న ఫ్రెంచ్ జాతీయ వేడుకలకు మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటున్న మోడీ ఫొటోలను విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ భారత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపినట్టు బాగ్చి పేర్కొన్నారు. ఇక్కడి ప్రవాస భారతీయులను చూస్తే తాను ఇండయాలోనే ఉన్నాననే అనుభూతి కలిగిందని అన్నారు. అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టి మాక్రాన్ మోడీకి ప్రత్యేకంగా విందు ఇచ్చారు.

ఫ్రాన్స్‌కు విదేశీయులు ఆర్థిక లేదాసాంస్కృతిక సేవలను అందించినా, మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ లేదా ఫ్రాన్స్ సమర్థించే విషయాలకు అంతర్జాతీయంగా మద్దతు ఇచ్చినా.. వారికి ఈ అవార్డు అదిస్తారు. వారి ప్రమాణాల ప్రకారం దౌత్య పరమైన సంబంధాల ద్వారా ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మద్దతునిస్తూ అధికారిక వ్యక్తులకు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హానర్ ఇవ్వడానికి విదేశీ పర్యటనలు కూడా కొన్ని సందర్బాలలో పరిగణిస్తారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you