NewsTelanganaమున్నూరుకాపు కార్పోరేషన్ కు ఛైర్మన్ ను నియమించాలని విజ్ణప్తి

మున్నూరుకాపు కార్పోరేషన్ కు ఛైర్మన్ ను నియమించాలని విజ్ణప్తి

-

- Advertisment -spot_img

మున్నూరు కాపు కార్పోరేషన్ కు ఛైర్మన్ ను వెంటనే నియమించాలని కోరుతూ తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం ఆధ్వర్యంలో మన్నూరు కాపు సంఘం నేతలు శుక్రవారం మంత్రి కొండా సురేఖను జూబ్లిహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుపోవాలని వారు మంత్రి సురేఖను కోరారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో పలు జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఈ సందర్బంగా మంత్రి సురేఖని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కాపుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుపోయి త్వరిత కాలంలోనే మున్నూరు కాపు కార్పోరేషన్ కు ఛైర్మన్ ను నియమించేలా చర్యలు చేపట్టడంతో పాటు, మున్నూరు కాపుల సంక్షేమంపై చర్చిస్తానని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. మున్నూరు కాపు కార్పోరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you