భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ఆపార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుండి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, మనోజ్ సిన్హా అధ్యక్షుని రేసులో ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లలో ఒకరికి పగ్గాలు అప్పగించి దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. మార్చి నెలాఖరు వరకు దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.