Friday, April 18, 2025
HomeUncategorizedAditya-L1: ఆదిత్య L1 లాంచ్ సక్సెస్.. 15లక్షల కి.మి. దూరం .. 125 రోజుల ప్రయాణం

Aditya-L1: ఆదిత్య L1 లాంచ్ సక్సెస్.. 15లక్షల కి.మి. దూరం .. 125 రోజుల ప్రయాణం

చంద్రయాన్ 3 విజయం తరువాత ఇస్రో మరో భారీ ప్రయోగాన్ని చేపట్టింది. సూర్యుని రహస్యాలను తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఈరోజు ఆదిత్య ఎల్ 1 మిషన్ ను పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఆదిత్య ఎల్ 1 రాకెట్ ఉదయం 11.50 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

భూమి దిగువ కక్ష్యలో ఉన్న లాగ్రేజియన్ పాయింట్ లో ఆదిత్య ఎల్ 1 నౌకను చేర్చడం, అక్కడి నుండి సూర్యుడి విషయాల గురించి అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఈ మిషన్ ద్వారా అంతకిక్షం వాతావరణంలో సూర్యుని పాత్రపై పరిశోధనలు చేయడం ఇస్రోకు వీలు అవుతుంది. నింగిలోకి వెళ్​లిన ఆదిత్య ఎల్ 1 తాను నిర్దేశించుకున్న లాగ్రాంజ్ పాయింట్ ను చేరడానికి 125 రోజులు అంటే నాలుగు నెలల సమయం పడుతుంది. భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇది ఎల్ 1 పాయింట్ కక్ష్యలోకి చేరుతుంది. ఈ పాయింట్ వద్ద భూమి, సూర్యుని రెండింటి గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉంటాయి. ఈ పాయింట్ లో ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. అక్కడ ముఖ్యంగా సూర్యుడి కరోనా, సౌర తుపాన్ల లాంటి ఇతర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది.ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం 46 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments