ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగినిపై లైంగికదాడి.. వింగ్ కమాండర్ పై ఎఫ్ఐఆర్

ఇండియ్ ఎయిర్ ఫోర్స్ లో లైంగిక వేదింపుల కేసు కలకలం రేపుతోంది. ఎయిర్ ఫోర్స్ లోని వింగ్ కమాండర్ తనపై లైంగికదాడి జరిపారని ఓ మహిళా అధికారి పోలీసులకు పిర్యాదు చేశారు. జమ్ము కశ్మీర్ లోని బుద్గాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు సహకరిస్తున్నామని వాయుసేన అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. నిందితుడు వాయుసేనలో వింగ్ కమాండర్ గా.. మహిళా ఉద్యోగి ఫ్లెయింగ్ ఆఫీసర్ గా కశ్మీర్ లోనే పని చేస్తున్నట్టు తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు 31న శ్రీనగర్ లోని ఆఫీసర్స్ మెస్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తన సీనియర్ అయిన వింగ్ కమాండర్.. నూతన సంవత్సర బహుమతులు తన ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తాను ఎంత అడ్డుకుంటున్నా వినకుండా ఆ అధికారి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపారు. కొన్ని రోజులపాటు తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారుల సహకారంతో తమ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. కల్నల్ స్థాయి అధికారి దీనిపై దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారని… అయినా ఏమీ తేల్చకుండానే దర్యాప్తు ముగిసిందన్నారు. దీంతో తాను అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినా.. ఆ కమిటీ కూడా నిందితుడికి హకరిస్తున్నట్లుగానే వ్యవహరించిందని అన్నారు. తాను ఒత్తిడి చేస్తేగానీ తనకు కనీసం వైద్యపరీక్షలు కూడా నిర్వహించలేదన్నారు. అతడికి సహకరిస్తున్న అధికారులతో కలిసి ప్రతిరోజూ పని చేయాల్సి వచ్చిందని, సదరు మహిళా అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను సామాజికంగా వెలివేసినట్లుగా వ్యవహరించారని, ఎవరైనా తనతో మాట్లాడితే వారిని ఉన్నతాధికారులు వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img