7 కోట్ల బంగారు ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్

అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశాడు ఓ ప్రభుద్ధుడు. నమ్మకంగా ఉంటూనే యజమానిని నట్టేట ముంచాడు. దొరికందే తడువుగా అందిన కాడికి దోచుకొని ధర్జాగా వెళ్లిపోయాడు. 7కోట్ల విలువైన బంగారు నగలతో కారులో పరారయ్యడు. హైదరాబాద్ లోని మధురానగర్ లో శుక్రవారం సాయంత్రం ఈఘటన చోటుచేసుకుంది.

ఎస్సార్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ లో నగల వ్యాపారం చేసే రాధిక ప్రముఖ నగల దుకాణాలనుండి వజ్రాభరణాలను కొనుగోలు చేసి వాటిని అవసరం అయిన వారికి సరఫరా చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఆమె వద్ద కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నమ్మకస్తుడుగా ఉండడంతో అప్పుడప్పుడూ కస్టమర్లకు నగలను అతనితో పంపించేవారు. ఈ క్రమంలోను శ్రీనివాస్ కు నగలపై కన్నుపడింది. ఎలాగయినా నగలను తస్కరించాలని అనుకున్నడు. సరైన సమయం కోసం అతను వేచి చూశాడు.


అతను ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నగల వ్యాపారి రాధిక ఉంటున్న అపార్ట్‌ మెంట్ లోఉండే అనూష 50 లక్షల విలువైన నగలను ఆర్డర్ చేశారు. అయితే శుక్రవారం ఆభరణాల డెలివరీ ఉందని రాధిక అనూషకు ఫోన్ చేశారు. ఆ సమయంలో తాను ఇంటి వద్ద లేనని.. మధురానగర్ లోని తమ బంధువుల ఇంటిలో ఉన్నాని చెప్పారు. ఆభరణాలను అక్కడికే పంపించాలని రాధికతో చెప్పారు. సేల్సమెన్ అక్షయ్, డ్రైవర్ శ్రీనివాస్ లతో మొత్తం 7 కోట్ల విలువ చేసే నగలను డెలివరీ కోసం పంపించారు. ఆ నగలలో 50 లక్షల విలువ చేసే నగలు అనూషకి సంబంధించినవి. మిగతా వజ్రాభరణాలు సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ లో ఇవ్వవలసి ఉంది.


మధురానగర్ లోని కస్టమర్ అనూష బంధువుల ఇంటికి చేరుకోగానే డ్రైవర్ శ్రీనివాస్ పథకం వేశాడు. తాను ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం అనూషకు ఆర్డర్ డెలివరీ చేయడానికి సేల్సమెన్ అక్షయ్ ఒక్కడినే ఇంటి లోపలికి పంపాడు. అక్షయ్ వచ్చేటప్పటికి డ్రైవర్ నగలు, వాహనంతో సహా పరారయ్యడు. సేల్స్ మెన్ వెంటనే ఫోన్ లో రాధికకు జరిగిన విషయం చెప్పడంతో, వెంటనే ఆమె ఎస్సార్ నగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ అపహరించుకొని వెళ్లిన నగల విలువా దాదాపుగా 7 కోట్లు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యదు చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img