Thursday, May 15, 2025
HomeNewsTelanganaటీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మాజీమంత్రి బాబూమోహన్

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మాజీమంత్రి బాబూమోహన్

మాజీమంత్రి బాబుమోహన్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడును కలిశారు. టీటీడీపీ నాయకులతో సమావేశం సంధర్బంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన సందర్బంగా చంద్రబాబును ఆయన కలిశారు. బీజేపీ పార్టీలో ఉన్న ఆయన శాసనసభ ఎన్నకల ముందు ఆపార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయన ఉండలేక ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బాబు మూహన్ తాజాగా టీడీపీ ఆఫీస్ కు రావడం.. చంద్రబాబును కలవడంతో ఆయన టీడీపీ గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది.

తెలంగాణ నాయకులతో సమావేశం సందర్భంగా చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ కమిటీలు అన్నీ రద్దు చేశారు. సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments