Wednesday, June 18, 2025
HomeNewsNationalకాషాయం రంగులోకి DD ప్రసార న్యూస్ లోగో ?

కాషాయం రంగులోకి DD ప్రసార న్యూస్ లోగో ?

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్ చానల్ దూరదర్శన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే..లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగి ఉన్న DD న్యూస్ చానల్ ఇప్పుడు దాని లోగో రంగును మార్చారు. అది కూడా కాషాయ రంగుకి మార్చారు. లోగోతో పాటు న్యూస్‌ అనే అక్షరాలను కూడా కాషాయ రంగు లోకి మార్చడం పట్ల అధికార బీజేపీపై పెద్ద యెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దూరదర్శన్‌ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించిందని, అందుకే కాషాయ రంగు లోకి మార్చేసి తన విధేయతను చాటుకుందని విమర్శలు వస్తున్నాయి. ఈ మార్పుపై ‘ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని గతంలో దూరదర్శన్‌ సీఈవోగా పని చేసిన టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ విమర్శించారు. దూరదర్శన్‌ చర్య మత ఉద్రిక్తతలను పెంచుతుందని తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments