NewsTelanganaనిర్మల్ లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ 2024

నిర్మల్ లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ 2024

-

- Advertisment -spot_img

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని అమర వీరుల స్థూపం వద్ద నుండి ప్రారంభమై మంచిర్యాల ఎక్స్ రోడ్ నుండి ఎస్పీ క్యాంప్ కార్యాలయం, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా నుండి తిరిగి అమర వీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఐపిఎస్ ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సైనికులలాగా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే జరుపుతున్నామని తెలిపారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ వారి మన్ననలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.

Also Read | తెలంగాణ నూతన స్పోర్ట్స్ పాల‌సీ నవంబర్ 2024 లోపు సిద్దం: సీఎం

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు, తన కుటుంబ క్షేమం కోసం విధిగా హెల్మెట్ తప్పక ధరించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, వాహనదారులు చేసే చిన్నచిన్న తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన వాహనదారులు మరణించడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పని సరిగా ధరించి, వాహనం నడపాలని ఎస్పీ కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you