దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కురుమ సోదరులు నమ్మకానికి మారుపేరని.. మృదుస్వభావులని వారిని కొనియాడారు. అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. ఆయన పేరుతో దొడ్డి కొమురయ్య భవన్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

4466f415 272c 4a78 ae24 d6e24a6428aa

కురుమ విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనసు రాలేదని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో డైట్ చార్జీలు పెంచి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

73587d21 e52c 4a6f a3ce f7f7ed7d7abf

రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ పథకాల్లో బలహీనవర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పినట్లు జమీందార్ల తెలంగాణ తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నామని సీఎం అన్నారు. ఈ తెలంగాణ తల్లి మన తల్లుల ప్రతిరూపమని అన్నారు. బిడ్డలు అభివృద్ధి పథం వైపు నడవాలని ఆశీర్వదించే తల్లిని మనం ప్రతిష్టించుకున్నామని వివరించారు.

b5929b4f f864 41ae 9fed ac502c7bcc56

కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్టంలో కులగణన 98 శాతం పూర్తయిందని, ఇంకా కేవలం 2 శాతం మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. కులగణన తెలంగాణకు మెగా హెల్త్ చెకప్ లాంటిదని ఆయన అన్నారు. కులగణన పూర్తయితే కురుమలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన వాటా దక్కుతుందని అన్నారు. గత ఎన్నిల్లో కాంగ్రెస్ కురుమ సోదరులకు రెండు, యాదవ సోదరులకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, కలిసికట్టుగా ఆవ్యక్తులను గెలిపంచుకున్నప్పుడే రాజకీయ పార్టీలు మళ్లీ టికెట్లు ఇస్తాయని అన్నారు.

dbd59d21 fee1 4351 8eec 8bf3bfd2b2f7

ముఖ్యమంత్రిగా ప్రభుత్వ విప్ లే తనకు కళ్లు, చెవులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నాలుగు సామాజిక వర్గాలకు విప్ లుగా అవకాశం కల్పించామన్నారు. బీర్ల ఐలయ్య విప్ గా ఉన్నాడు కాబట్టే కురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడని తెలిపారు. కురుమలకు వచ్చిన అవకాశం వదులుకోవద్దని.. మీ బిడ్డలను మీరు గెలిపించుకుంటేనే మీకు ప్రాధాన్యత ఉంటుందని సూచించారు.

0c6c97cf 2f48 4c4b b408 8ce485c31be7

వేర్వేరు పార్టీల్లో ఉన్నా… కొన్ని సందర్భాల్లో మీ సామాజిక వర్గాలను గెలిపించుకోవాలని, అప్పుడే ఈ సమాజంలో మీకు మనుగడ ఉంటుందని అన్నారు. ఈ ప్రభుత్వం మీది అని, కురుమల సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. భవిష్యత్ లో రాజకీయంగా, ఆర్ధికంగా కురుమల కోటా కురుమలకు వచ్చేలా చూసే బాధ్యత తనదని అన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య (Kancha Ilaiah) సూచనను పరిశీలిస్తామని అన్నారు. దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

803a80f8 4060 408b 9494 835db4ab2799
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

Topics

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img