Thursday, May 15, 2025
HomeNewsTelanganaతెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడింది: జేపీ నడ్డా

తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడింది: జేపీ నడ్డా

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభిఅభివృధ్ధిలో ముందుకు దూసుకు పోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ నవసంకల్ప సభలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. తెలంగాణలో మాత్రం కేంద్ర కొన్నికేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు కాకుండా ఇక్కడి నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీ ఆర్ ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారని అన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్‌, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు మాత్రమే సంతోషంగా ఉన్నారని నడ్డా విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 4కోట్ల మందికి ఇళ్లు నిర్మించాము. మోడీ ప్రభుత్వంలో 80 కోట్ల మంది ప్రజలకు రేషన్‌ అందిస్తున్నాము. ప్రధాని మోడీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని నడ్డా అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశం లో పేదరికం 10 శాతానికి పడిపోయిందని అన్నారు. కమల వికాసంతోనే తెలంగాణ అభివృధ్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. రైతులకు ఎకరానికి రూ.6వేలు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ప్రతీ సంవత్సరం అందిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినా దేశం సమర్థవంతంగా అభివృద్ధి లో దూసుకు పోతోందని అన్నారు. అన్ని రంగాల్లో భారత్‌ దూసుకెళ్తోందని.. మోడీని గ్లోబల్‌ లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతోందని బీజేపీ జాతీయ అద్యక్షుడు జే పీ నడ్డా నాగర్ కర్నూల్ సభలో వివరించారు.

అంతకు ముందు, జేపీ నడ్డా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను టోలీచౌకీలోని ఆయన నివాసంలో కలిశారు. సంపర్క్ సే సంవర్ధన్ కార్యక్రమంలో భాగంగా నాగేశ్వర్ ను కలిశారు. నడ్డా తో పాటు ఎంపీ లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్లారు. తరువాత, పద్మశ్రీ అవార్డ గ్రహీత, కొరియోగ్రాఫర్ ఆనంద శంకర్ జయంత్ ఇంటికి నడ్డా వెళ్లారు. ఇటీవల మన్ కీ బాత్ కర్యక్రమంలో ఆనంద శంకర్ జయంత్ పేరును ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments