Friday, March 21, 2025
HomeNewsTelanganaBandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. అందుకోసం రాజకీయాలనుండి తప్పుకునేందుకు సిద్దమని ప్రకటన

Bandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. అందుకోసం రాజకీయాలనుండి తప్పుకునేందుకు సిద్దమని ప్రకటన

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యమని.. హిందూ ధర్మం కోసం అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకునేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. హిందూ ధర్మ రక్షణ కోసం, ప్రజల కోసం తన జీవితాన్నే ధారపోశానన్నారు. ధర్మం కోసం కొట్లాడిన తాను ఏనాడూ చావుకు భయపడలేదన్నారు. చావే తనను చూసి భయపడిందన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజాసింగ్, తన లాంటి వాళ్లను గెలిపించకపోతే ఇకపై ఎవరూ కూడా హిందూ ధర్మం గురించి మట్లాడే వారుండరని తెలిపారు. కరీంనగర్ లోని వివిధ డివిజన్లకు చెందిన 500 మంది యువకులు శుక్రవారం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments