Thursday, May 15, 2025
HomeNewsTelanganaVice Chancellor: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

Vice Chancellor: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

తెలంగాణలో యూనివర్సిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది. ఈమేరకు వీసీలను నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులను జారీచేశారు. గతంలో యూనివర్సిటీల్లో వీసీలను నియమించాలని పలుమార్లు విద్యర్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించడాన్ని విద్యార్ధులు స్వాగతిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, మిగతా యూనివర్సిటీలకు కూడా ఉపకులపతులను నియమించారు.

ఏ యూనివర్సిటీకి ఎవరు వైస్ చాన్సలర్ ?

  1. ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ – పాలమూరు విశ్వవిద్యాలయం
  2. ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి – కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌
  3. ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్ – ఉస్మానియా యూనివర్సిటి
  4. ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ – శాతవాహన యూనివర్సిటి
  5. ప్రొఫెసర్ నిత్యానందరావు – తెలుగు విశ్వవిద్యాలయం
  6. ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ – మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
  7. ప్రొఫెసర్ యాదగిరిరావు – తెలంగాణ యూనివర్సిటి
  8. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య – జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటి
  9. ప్రొఫెసర్ రాజిరెడ్డి – కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments