ప్రధానమంత్రి సూర్య ఘర్ (PM Suryaghar )పథకం ద్వారా బీసీలకు ఇచ్చే రాయితీకి అదనంగా మరో రూ.20య వేలు సబ్సిడీగా అందిస్తామని ఏపీ సీఎం (AP CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అసెంబ్లీలో తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్లు రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా 2 కి.వాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు రూ.1.20 లక్షల ఖర్చు అవుతుంది. అందులో కేంద్రప్రభుత్వం రూ.60 వేల సబ్సిడీని అందిస్తుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ప్రకారం బీసీలకు మరో రూ.20 వేలు సబ్సిడి అదనంగా చేకూరనుంది. దీంతో వినియోగదారులకు రూ.80 వేలు రాయితీ రూపంలో లబ్ది చేకూరుతుంది. రాష్ట్రంలో బీసీలకు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సభలో సీఎం ప్రకటించారు.
పీఎం సూర్య ఘర్ పథకంలో ఇంటిపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చే బలహీన వర్గాల వారికి అదనపు రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్ణయం తీసుకోవడం ఆనందం కలిగిస్తున్నది. కేంద్ర ఇచ్చే రాయితీకి అదనంగా బీసీలకు మేలు కలిగించడం మా బాధ్యతగా భావిస్తున్నాము. 2 కిలో వాట్ల సోలార్… pic.twitter.com/4X0mBXE2bi
— N Chandrababu Naidu (@ncbn) March 13, 2025
Also Read…| Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు