Cinemaఅనుపమ పరమేశ్వరన్ 'పరాదా' మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

-

- Advertisment -spot_img

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న ‘పరాదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 22న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఇటీవలే ‘థీమ్ ఆఫ్ పరాదా: యత్ర నార్యస్తు పూజ్యంతే..’ అనే పాటను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ సినిమా విడుదల వెనుక ఉన్న కష్టాలను, ఒక మహిళా ప్రధాన చిత్రానికి ఎదురయ్యే సవాళ్లను భావోద్వేగంగా వెల్లడించారు.

అనుపమ ఏమన్నారంటే…

అనుపమ మాట్లాడుతూ, ‘పరాదా’ ఒక సాధారణ సినిమా కాదని, తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. “ఒక మంచి విడుదల తేదీ దొరకడానికి ఆరు నెలలు పట్టింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అదేరోజు పెద్ద సినిమా రిలీజ్ అయ్యేది. థియేటర్లు దొరకలేదు. అందుకే ఇంత సమయం పట్టింది. నిజం చెప్పాలంటే.. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు. అది ఎంత మంచి సినిమా అయినా అంతే. దాన్ని తప్పు అని నేను అనడం లేదు. అది వాస్తవం. ‘పరాదా’ కారణంగానే ఈ వాస్తవాన్ని తెలుసుకున్నాను,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు సంవత్సరం క్రితమే సినిమా సిద్ధమైనా, విడుదల కోసం ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఈ క్రమంలో చిత్ర బృందం పడిన శ్రమను దగ్గరగా చూశానని అనుపమ వివరించారు.

Also Read..| తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

‘పరాదా’ చిన్న సినిమా అని అందరూ చెబుతున్నా, ఇది చాలా మంచి సినిమా అని, ఎన్నో కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయని అనుపమ భరోసా ఇచ్చారు. “చిరంజీవి పుట్టినరోజుకు మించి ఈ సినిమాను విడుదల చేయడానికి మంచి తేదీ ఉండదు. అందుకే ఆగస్టు 22న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం,” అని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల వెల్లడించారు. తన మొదటి చిత్రం ‘సినిమా బండి’కి ఇఫీలో అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి దగ్గర నుంచి దీవెనలు తీసుకున్న విషయాన్ని, అలాగే రామానాయుడు స్టూడియోస్లో సురేశ్ బాబు తనను ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సురేశ్ బాబు ‘పరాదా’ కథ విన్న తర్వాత కళ్లల్లో నీళ్లు తిరిగాయని, ఇది తనకెంతో ప్రత్యేకమని దర్శకుడు తెలిపారు. సినిమా అంతా ‘పరదా’లోనే ఉండాలంటే ఏ నటీ అంగీకరించదని, అలాంటి సవాలుతో కూడుకున్న పాత్రకు అనుపమ అంగీకరించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని ప్రవీణ్ ప్రశంసించారు. విభిన్నమైన సోషియో డ్రామాగా రూపొందిన ‘పరాదా’ చిత్రం, అనుపమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


anupama parameswaran comments on paradha cinema

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest news

నటి శ్వేతా మేనన్‌పై కేసు నమోదు

ప్రముఖ నటి శ్వేతా మేనన్‌ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఆర్థిక ప్రయోజనాల కోసం అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ...

ఉద్యోగం చేసే మహిళకు భరణం అక్కర్లేదు ‘సుప్రీం’ సంచలన తీర్పు !

ఉద్యోగం చేసే మహిళకు భరణం అక్కర్లేదు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువ‌రించింది. విడాకుల త‌ర్వాత భార్య‌ భరణం కోసం భర్తపై ఆధారపడడంపై సుప్రీంకోర్టు తీవ్ర...

మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న పై తీర్పు రిజ‌ర్వు

రాష్ట్రంలోని వైద్య‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న ఇప్పుడు న్యాయపరమైన వివాదాలకు కార‌ణం అయింది. రాష్ట్రంలో...

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల్సిందే..!

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ ను ఆమోదించుకోవ‌డానికి తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ మూడు రోజుల‌పాటు వివిధ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని ఇప్ప‌టికే...
- Advertisement -spot_imgspot_img

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ‘లిల్లీపుట్’ అంటూ అటాక్ !

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలపై ఆమె తీవ్రంగా స్పందించారు. "నేను తెలంగాణ ఆడబిడ్డను. నా పైన...

తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..?

తెలంగాణ సీఎస్ ( ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి ) పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత సీఎస్‌ కే....

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you