Sunday, March 23, 2025
HomeNewsTelanganaముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం: బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం: బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

వికసిత్ భారత్ లక్ష్యంగా వికసిత్ పత్రాన్ని నరేంద్ర మోదీ గ్యారంటీగా ప్రజల ముందుంచాం. అందుకు భిన్నంగా కాంగ్రెస్ విభజిత్ రాజకీయాలతో, విభజన భారత్ విధానాలతో వ్యవహరిస్తోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. విపక్ష కూటమికి ఓటమి తప్పదని తెలిసిపోయాక విభజించు భారత్ విధానాన్ని తెర మీదకు తెచ్చారని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది.. అంబేద్కర్ ను గౌరవించి భారత రత్న ఇచ్చిన ఘనత బీజేపీదేనని తెలిపారు. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందని ఆయన దుయ్యబట్టారు. ముస్లిం సంతుష్టీకరణ విధానాలతో కాంగ్రెస్ హిందూ సమాజంపై విషం జిమ్ముతోందని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ సనాతన ధర్మం వినాశనం కోరుకునే పార్టీ అని ఆరోపించారు. CAA పట్ల కాంగ్రెస్ కూటమి విష ప్రచారం చేస్తోందన్నారు. పౌరసత్వం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిప్పులు పోసుకుంటుందని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతంగా ఉంది.. అయితే, అధికారంలోకి వస్తె 370 నీ మళ్ళీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్లతో చిచ్చు పెడుతోందని నిప్పులు చెరిగారు. బీసీ (ఈ) లోకి ముస్లిoలను తెచ్చి అదనంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిoచడం బీసీలకు అన్యాయం చేసినట్టు కాదా..? అని ప్రశ్నించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments