Tuesday, April 22, 2025
HomeNewsTelanganaమాజీప్రధాని పీవీకి నివాళులు అర్పించిన అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మెన్ లు

మాజీప్రధాని పీవీకి నివాళులు అర్పించిన అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మెన్ లు

భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్నపీవీ నరసింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో పీవీ చిత్రపటానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ఎమ్మెల్సీ మధుసూధనా చారి , లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ గడ్డమీద పుట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడు పీవీ నరసింహారావు” అని తెలిపారు. అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడే బహుభాషా కోవిదుడు అని కొనియాడారు . ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments